ఆంధ్రపోరి కాంటెస్ట్ ఆరంభం... ఏప్రిల్ 25న ఆడియో రిలీజ్..!
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూర్తి స్థాయి హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ఆంధ్రాపోరి. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్నిమిస్తున్న ఈ సినిమాకు ఋషి సినిమా ఫేం రాజ్ మాదిరాజ్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో ఈ యంగ్ హీరో సరసన ఉల్కా గుప్తా హీరోయిన్ గా నటించింది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా జరుపుతోంది. ఈ చిత్ర ఆడియోను ఏప్రిల్ 25న విడుదల చేసేందుకు సినీ యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
ఈ చిత్ర ప్రమోషన్ వర్క్లో భాగంగా ఆంధ్రపోరి కాంటెస్ట్ను ప్రారంభించింది. ఏప్రిల్ ఆరో తేది ప్రారంభమైన ఈ కాంట్రెస్ట్లో ప్రతి రోజు సినిమాకు సంబంధించిన కాంటెస్ట్ పెడుతూ వారికి బహుమతులు ఇవ్వనున్నది. ఈ కాంటెస్ట్ లో గెలిచిన విజేతలకి సినిమా యూనిట్ ఆడియో విడుదలకి పాసులతోపాటు ప్రత్యేక బహుమతులు అందజేయనుంది.