హైదరాబాద్ నగరంలోని జేఎన్టీయూ పరిధిలోని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులకు శుభవార్త వెలువడింది. ఈ పరిధిలోని కాలేజీలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులకు గ్రేస్ మార్కులు ఇచ్చేందుకు యూనివర్శిటీ సమ్మతం తెలిపింది. విద్యార్థులు కోరడంతో డీన్లతో మాట్లాడిన యూనివర్శిటీ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా దాదాపు నాలుగు వేల మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (జెఎన్టీయూహెచ్) కీలక ప్రకటన చేసింది. యూనివర్సిటీ పరిధిలో...