1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 4 Girl Students who studies 10th calss Missing from Pithapuram

పీఠాపురంలో నలుగురు బాలికల అదృశ్యం

East Godavari
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా పీఠాపురంలో నలుగురు బాలికలు అదృశ్యమయ్యారు. ఇది స్థానికంగా కలకలం రేపింది. ఇద్దరు బాలికల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కనిపించకుండా పోయిన విద్యార్థినులంతా పదో తరగతి చదువుతున్నారు. 
 
గత నెల 30వ తేదీన పాఠశాలకు వెళ్లిన ఓ బాలిక ఆ తర్వాత ఇంటికి తిరిగిరాలేదు. అలాగే, శనివారం తెల్లవారుజామున నుంచి మరో ముగ్గురు బాలికలు కనిపించకుండా పోయారు.
 
అదృశ్యమైన బాలికల ప్రవర్తన బాగాలోదని వారి తల్లిదండ్రుల సమక్షమంలోనే పాఠశాల ఉపాధ్యాయులు పలుమార్లు మందలించారు కూడా. ఈ పరిస్థితుల్లో వారు కనిపించకుండా పోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. బాధిత విద్యార్థినిలు తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
తర్వాతి కథనం
ఏపీలో 26 జిల్లాలకు కలెక్టర్లు - ఎస్పీల నియామకం