1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 మే 2025 (18:28 IST)

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

Rains
నైరుతి రుతు పవనాల కారణంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, సెంట్రల్ కోస్తా, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. జూన్ రెండో వారం నుంచి రెండు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నాయి.
 
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ ప్రకారం, రాబోయే 24 గంటల్లో పశ్చిమ-మధ్య దానిని ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. 
 
ఈ పరిణామం వల్ల రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో గంటకు 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 
 
నైరుతి రుతు పవనాలు ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించాయి. ఫలితంగా ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీనికితోడు బంగాళాఖాతంలో ఏర్పడి అల్పపీడనం క్రమంగా బలపడనుంది. మరో రెండ్రోజుల్లో వాయుగుండంగా మారనుందని ఐఎండీ హెచ్చరించింది. 
 
క్రమంగా రానున్న 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారనుంది. అక్కడి నుంచి వాయుగుండంగా మారవచ్చని తెలుస్తోంది. ఈ నెల 29 నాటికి వాయుగుండంగా మారి ఆ తరువాత తుపానుగా మారే అవకాశాలున్నాయి.