ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సంభవించిన వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు వరద ముంపు ప్రాంతాల్లో ప్రజలు జలదిగ్భంధంలో చిక్కుకుని ఇక్కట్లు పడుతున్నారు. ఇలా వరద నీటిలో చిక్కుకుపోయి విలవిలలాడుతున్న బాధితులకు సహాయం చేసేందుకు ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ముందుకు వచ్చారు. ఇటు తెలుగు చిత్ర సీమకు చెందిన వారు కూడా భారీగా విరాళాలు ప్రకటిస్తున్నారు. ఇప్పుడు...