1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 మార్చి 2021 (16:30 IST)

భూమిలోంచి పాములు.. ఒకటి కాదు.. రెండు కాదు.. 20..!

భూమిలోంచి పాములు వెలికి వస్తున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 20కి పైగా పాము పిల్లలు భూమిలోంచి బయటకు వచ్చాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా, అయిజ మండలం, వెంకటాపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వెంకటాపురంలో రోడ్డుపక్కన మిషన్ భగీరథ కోసం గొయ్యి తీసి పూడ్చివేశారు. అందులోనే పాము గుడ్లను పెట్టింది. 
 
మొదట ఈ గొయ్యి నుంచి పాము పిల్ల బయటకు వచ్చింది. స్థానికులు చూసి ఆశ్చర్యపోయారు. ఒకదాని వెనుక ఒకటి ఇలా 20కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి. అయితే ఈ పాము పిల్లలను చంపేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో పరిసరాల్లోకి వెళ్లిపోయాయి. 
 
ఆ తర్వాత గొయ్యిని తవ్విన స్థానికులకు అందులో మరిన్ని పాము గుడ్లు కనిపించాయి. వాటిని ధ్వంసం చేసి గొయ్యిని పూడ్చివేశారు. అయితే తప్పించుకున్న పాములు ఇళ్లల్లోకి వచ్చి కాటేస్తాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు.