హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ విషాదకర ఘటన జరిగింది. తన భర్త రెండో పెళ్లి చేసుకుని వేధిస్తుండటంతో భరించలేని ఓ వివాహిత తన ఇద్దరు పిల్లలను హత్య చేసి తాను కూడా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. మంగళవారం జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే, వరంగల్ జిల్లా ఎల్లయ్యగూడెం పంచాయతీలోని మాణిక్యం తండాకి చెందిన బోడ ప్రవీణ్ అదే పంచాయతీలోని పదహారు చింతల...