శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2017 (09:29 IST)

ఇంటెక్స్ టెక్నాలజీస్ నుంచి కొత్త 4జీ ఫీచర్లు ఫోన్లు.. జియోకు ముందే రిలీజ్

దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన నవరత్న సిరీస్‌లో కొత్త 4జీ వోల్టే ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. తద్వారా రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ కంటే ముందు మార్కెట్లోకి ఇంటెక్స్ 4జీ ఫీచర్ల

దేశీయ మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీ ఇంటెక్స్ టెక్నాలజీస్ తన నవరత్న సిరీస్‌లో కొత్త 4జీ వోల్టే ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. తద్వారా రిలయన్స్ జియో 4జీ ఫీచర్ ఫోన్ కంటే ముందు మార్కెట్లోకి ఇంటెక్స్ 4జీ ఫీచర్లు ఫోన్లు విడుదలవుతున్నాయి.

వీటితో పాటు కంపెనీ ఇదే సీరీస్‌లో మరో ఎనిమిది 2జి ఫీచర్‌ ఫోన్లను కూడా విడుదల చేసింది. వీటి ధర ఫీచర్లను బట్టి రూ.700 నుంచి రూ.1,500 వరకు ఉంది. 
 
టర్బో ప్లస్ 4జి పేరుతో విడుదల చేసిన 4జి వోల్ట్‌ ఫీచర్స్‌ ఫోన్లఫీచర్ల సంగతికి వస్తే... 512 ఎంబీ రామ్, 4జీబీ 32 జీబీ వరకు పెంచుకునే సౌకర్యం, వెనక 2 ఎంపీ, ముందు వీజఏ షూటర్, 2000 ఎంఎహెచ్ బ్యాటరీని కలిగుంటుంది.

ఇంకా 2.4 అంగుళాల క్యువిజిఎ డిస్ ప్లేను ఈ ఫోన్లు కలిగుంటాయి. ఇంటెక్స్ ఎకొ 102 ప్లస్‌లో 800ఎంఏహెచ్ బ్యాటరీ, వైర్‌లెస్ ఎఫ్ఎమ్, కెమెరా వుంటుంది. ఇక ఇంటెక్స్ ఎకొ 106 ప్లస్ ఫీచర్ల సంగతికొస్తే.. 1000ఎమ్ఎహెచ్ బ్యాటరీ, వైరల్ సెల్ఎఫ్, 32జీబీ ఎక్స్‌పాండబుల్ మెమరీని కలిగివుంటుంది.