1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. A mother with two children committed suicide

ఇద్దరు పిల్లలతో కలిసి చెరువులో దూకేసిన తల్లి.. కారణం అదే..

suicide
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ తల్లి ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం సాయంత్రం తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 
 
వివరాల్లోకి వెళితే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలానికి చెందిన మార్కంటి స్వామికి మెదక్ జిల్లా మనోహరాబాద్‌కు చెందిన గుండ్ల భానుప్రియ (28)తో ఎనిమిదేళ్ల క్రితం వివాహమైంది. కూలి పని చేసే ఈ దంపతులకు వేదాంష్ ఆనంద్ (5), దీక్ష (4) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
దీక్ష పుట్టినప్పటి నుండి క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇది కుటుంబంపై తీవ్ర మానసిక, ఆర్థిక ఒత్తిడిని కలిగించింది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 
 
దీంతో మనస్తాపానికి గురైన భానుప్రియ పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
దువ్వాడ శ్రీనివాస్ ఆలనా.. పాలనా నేనే చూసుకున్నా : దివ్వల మాధురి