1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Telangana: Another Sircilla weaver burdened with debts ends life

Telangana: రూ.6లక్షల అప్పుల బాధ.. యాసిడ్ తాగిన చేనేత కార్మికుడు

Sircilla weaver
Sircilla weaver
తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోలేక, సిరిసిల్ల చేనేత కార్మికుడు పరికిపెల్లి రాజు (55) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందిరమ్మ కాలనీకి చెందిన రాజు సోమవారం తన ఇంట్లో బాత్రూమ్ క్లీనింగ్ యాసిడ్ తాగాడు. కుటుంబ సభ్యులు అతన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం ఆయన తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య పద్మ, కుమారుడు రాకేష్, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 
 
స్థానిక వివరాల ప్రకారం, చేనేత కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించే రాజు, ఇద్దరు కుమార్తెలు, కొడుకుల వివాహాలు చేయించాడు. పెళ్లిళ్ల కోసం దాదాపు రూ.6 లక్షల అప్పులు చేశాడు. అయితే, రాజు గత కొన్ని నెలలుగా పని లేకుండా ఉన్నాడు. కుటుంబాన్ని నడపలేక, అప్పులు తీర్చలేక, మద్యానికి బానిసై, నిరాశకు గురయ్యాడు. దీంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
హామీ నెరవేరింది .. సంతోషంగా ఉంది.. మాట నిలబెట్టుకున్నా : పవన్ కళ్యాణ్