1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శనివారం, 11 జనవరి 2020 (03:22 IST)

తెలంగాణలో త్వరలో హెలీపోర్ట్​ లు

తెలంగాణలో కొత్తగా హెలీపోర్టులు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్​ ప్రకటించారు. వీటి ద్వారా ఆలయ పర్యాటకానికి ఊతం లభిస్తుందని... దిల్లీలో జరిగిన వింగ్స్‌-2020 సన్నాహాక సమావేశంలో తెలిపారు.

కొత్త విమానాశ్రయాలు, హెలీపోర్టుల నిర్మాణానికి కేంద్రం నిధులు, అనుమతులు ఇచ్చి సహకరించాలని కేటీఆర్​ విజ్ఞప్తి చేశారు. దిల్లీలో జరిగిన వింగ్స్‌ ఇండియా-2020 సన్నాహాక సదస్సులో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్​ పాల్గొన్నారు. హైదరాబాద్‌ బేగంపేట వేదికగా మార్చి 12 నుంచి 15 వరకు వింగ్స్‌ ఇండియా సదస్సు జరగనుంది.

ఇందుకోసం దిల్లీలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో కేటీఆర్​ పాల్గొన్నారు. త్వరలో బేగంపేటలో ఇన్‌స్టిట్యూట్‌ వరంగల్‌, ఆదిలాబాద్, కొత్తగూడెం, జక్రాన్‌పల్లి, రామగుండం, మహబూబ్‌నగర్‌లో కొత్త విమానాశ్రయాలతోపాటు పలు ప్రాంతాల్లో హెలీపోర్టుల ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి వివరించారు.

హెలీపోర్టుల ద్వారా ఆలయ పర్యటక అభివృద్ది చెందుతుందన్నారు. సివిల్‌ ఏవియేషన్‌ శిక్షణ కోసం బేగంపేటలో ఈ ఏడాది ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభిస్తామని.... క్రమంగా ఏరోస్పేస్‌ యూనివర్సిటీ స్థాయికి విస్తరిస్తామని తెలిపారు. నిధులు, త్వరితగతిన అనుమతులు ఇచ్చి కేంద్రం సహకరించాలని కేటీఆర్​ కోరారు.