1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (14:17 IST)

చిన్నాన్న కూతురిపై 6 నెలల పాటు అత్యాచారం.. మైనర్ గర్భం దాల్చడంతో...?

rape
కామాంధులు వావి వరసులు మరిచిపోతున్నారు. వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్నారు. తాజాగా విచక్షణ మరిచి వరుసకు చెల్లెలు వరసయ్యే బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలో చోటుచేసుకుంది. ఆరు నెలలుగా లైంగిక దాడి చేస్తుండగా బాలిక గర్భం దాల్చడంతో గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. వావివరసలను మరిచి మైనర్ అయ్యే చెల్లెలిపై కామాంధుడు కన్నేశాడు. ఆరు నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు కన్నాయిగూడెం మండలం వాసంపల్లిలో చంటి(28) అనే యువకుడని తేలింది. ఇతని పెళ్లై.. భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. 
 
ఈ కామాంధుడి కళ్లు తన సొంత చిన్నాన్న కూతురిని వేధించి, బెదిరించి తన కామవాంఛను తీర్చుకుంటున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరింపులకు గురి చేశాడని, తన తల్లిదండ్రులనూ హతమారుస్తాన, ఇల్లు తగల పెడతానని భయపెట్టినట్లు బాలిక తెలిపింది.
 
మూడు రోజుల క్రితం ఆ బాలికకు కడుపునొప్పి రావడంతో తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా... గర్భం దాల్చినట్లు వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఆ బాలికను నిలదీయడంతో బాలిక అసలు విషయం చెప్పింది. 
 
బాధితురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టిన పోలీసులు ఫోక్సో చట్టం, 376 సెక్షన్ కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నారు.