గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (10:10 IST)

ప్రేమ ప్రాణం తీసింది.. మెట్టెలు, పుస్తెలతాడును చూసి..?

ప్రేమ ప్రాణం తీసింది. ప్రేమికుడిని వివాహం చేసుకుని.. ఒంటరిగా ఇంటికొచ్చిన ఓ యువతిని తల్లిదండ్రులు దూషించడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఇంకా గుట్టుగా ప్రేమ వివాహం చేసుకున్నందుకు తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో మందలించడంతో ఆ యువతి మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన నల్లగొండ జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే... నేరేడుగొమ్ము మండల కేంద్రానికి చెందిన వరికుప్పల శ్రీను-సుజాత కూతురు రూప(21) హైదరాబాద్‌లో నర్సింగ్ శిక్షణ పొందుతూ అక్కడే నాంపల్లి మండలం మల్లరాజుపల్లి గ్రామానికి చెందిన సత్యంను ప్రేమించింది. సత్యం తల్లిదండ్రులు వీళ్ల పెళ్లికి నిరాకరించడంతో గుట్టుగా వివాహం చేసుకుని ఇటీవల స్వగ్రామంలో జరిగిన పండుగకు వచ్చారు. 
 
సత్యం తల్లిదండ్రులు దూషించడంతో ఒంటరిగా నేరేడుగొమ్ములోని తల్లిదండ్రుల వద్దకు వచ్చింది. మెట్టెలు, పుస్తెలతాడును చూసి తల్లిదండ్రులు సైతం తీవ్రంగా మందలించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. దేవరకొండ ప్రభుత్వ దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.