గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : మంగళవారం, 27 అక్టోబరు 2020 (18:41 IST)

రెండేళ్లపాటు రేప్ చేశాడు... ఇప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి వీడియోలు..

వరుసకు చెల్లి అయ్యే బాలికపై కన్నేశాడు. స్నానం చేస్తుండగా ఫొటోలు తీసి బెదిరించాడు.. ఏకంగా రెండేళ్లపాటు రేప్ చేశాడు. ఇప్పుడు ఫ్రెండ్స్​తో కలిసి అఘాయిత్యం చేశాడు.

అందరూ వీడియోలు తీసుకుని వాట్సాప్, ఫేస్​బుక్​లో పోస్టు చేశారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో జరిగిందీ పైశాచిక ఘటన. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కేసు వివరాలను మెట్ పల్లి డీఎస్పీ గౌస్ బాబా తెలిపారు.
 
వీడియోలు తీసి.. షేర్ చేసి..
మెట్​పల్లికి చెందిన ఓ బాలిక (14) ఇంటిపక్కనే వరుసకు అన్న అయ్యే రాజేశ్ ఉంటున్నాడు. రెండేళ్ల కిందట బాలిక స్నానం చేస్తుండగా ఫొటోలు తీశాడు. ఆ ఫొటోలను బాలికకు చూపించి బ్లాక్ మెయిల్ చేశాడు. తాను చెప్పిన దానికి ఒప్పుకోక పోతే ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు.

అమ్మాయిని లొంగదీసుకుని రెండేండ్లలో పలుసార్లు అత్యాచారం చేశాడు. 20 రోజుల కిందట బాధితురాలికి ఫోన్ చేసి ఓ స్కూల్ వెనకాల ఉన్న గోడ వద్దకు రావాలని చెప్పాడు. బాలిక అక్కడికి వెళ్లగానే రాజేశ్ ఆమెను మరోసారి రేప్ చేశాడు. దీన్ని అతని స్నేహితులు వీడియో తీశారు.

తర్వాత దారంగుల సాయిలు, మొగిలిపాక అనిల్ కుమార్, కుంచెపు శివ, కుంచెపు వెంకటేశ్ రేప్ చేశారు. వీరందరూ అత్యాచారం చేసేటప్పుడు ఒక్కొక్కరు వీడియోలు తీసి వాట్సాప్, ఫేస్ బుక్ లో పోస్టు చేశారు. వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడంతో విషయం బయటికి వచ్చింది.

బాధితురాలి కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఐదుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి ఐదు సెల్ ఫోన్లు, రెండు బైకులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్‌కు తరలిస్తామని డీఎస్పీ తెలిపారు.