1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. 5 Judges To Hear Plea On Rejected Chief Justice Impeachment Move

చీఫ్ జస్టిస్ అభిశంసన : సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌కు చుక్కెదురు

భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది.

Suprme Court
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాను అభిశంసించాలని రాజ్యసభలో నోటీసులిచ్చి విఫలమైన కాంగ్రెస్ పార్టీకి ఇపుడు ఏకంగా అత్యున్నత న్యాయస్థానంలోనూ చుక్కెదురైంది. తమ నోటీసులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, పలువురు కాంగ్రెస్ ఎంపీలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, మంగళవారం పిటినష్‌ను విచారించిన ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనం, దాన్ని తోసిపుచ్చింది.
 
నిబంధనల మేరకే ఉపరాష్ట్రపతి నిర్ణయం తీసుకుని ఉంటారని అభిప్రాయపడిన అత్యున్నత ధర్మాసనం, పిటిషన్‌పై తదుపరి విచారణ ఉండబోదని తేల్చిచెప్పింది. ఈ విషయమై రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలన్న కాంగ్రెస్ వినతినీ తోసిపుచ్చింది. విషయాన్ని పార్లమెంట్ వేదికగానే తేల్చుకోవాలని సూచించింది. మీకు మీరుగానే పిటిషన్‌ను వెనక్కు తీసుకోవాలని సూచన చేయగా, ఆపై తమ పిటిషన్‌ను విత్ డ్రా చేసుకుంటున్నామని కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ధర్మాసనానికి తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ అభిశంసన తీర్మానం అశంలో కాంగ్రెస్ భంగపాటుకు గురైంది. 
About Writer
pnr
తర్వాతి కథనం
కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజార్టీ వస్తే ప్రధానిని నేనే : రాహుల్ క్లారిటీ