1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. 35K drone pilots to make AP drone hub

ఏపీలో 35,000 మంది డ్రోన్ పైలట్‌లకు శిక్షణ.. చంద్రబాబు

drone
డ్రోన్ టెక్నాలజీకి రాష్ట్రాన్ని మానవ వనరుల కేంద్రంగా నిలిపి ఆంధ్రప్రదేశ్‌లో 35,000 మంది డ్రోన్ పైలట్‌లకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న డ్రోన్ విధానంపై రాష్ట్ర ప్రభుత్వం కాన్సెప్ట్ నోట్‌ను విడుదల చేసింది. రాబోయే 15 రోజుల్లో తయారీదారులు, ఆవిష్కర్తల కోసం వ్యాపార అనుకూల వాతావరణాన్ని నెలకొల్పడానికి సమగ్ర డ్రోన్ విధానం ఉంటుంది. 
 
రెండు రోజుల డ్రోన్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తూ, వివిధ పరిశ్రమలలో డ్రోన్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చగల నైపుణ్యం కలిగిన వర్క్‌ఫోర్స్‌ను రూపొందించడానికి ఇది దోహదపడుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
 
ప్రతిరోజూ 400 మిలియన్ టెరాబైట్ల డేటా ఉత్పత్తి అవుతుందని, ఏఐతో కలిపితే వివిధ స్థాయిలకు ఆవిష్కరణలను నడిపించే అవకాశం ఉందన్నారు. ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ టెక్నాలజీల ద్వారా నడిచే నాలెడ్జ్ ఎకానమీ గురించి కూడా సీఎం చంద్రబాబు మాట్లాడారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ.. రోడ్ షో, నామినేషన్ దాఖలు