1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Amaravati JAC 6 days plan ready

అమరావతి రాజధాని రైతులు ఉద్యమానికి ఒక యేడాది!

Amaravati JAC
మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమానికి ఒక యేడాది కానుంది. ఈ నెల 17వ తేదీతో ఒక సంవత్సరం పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అమరావతి రాజకీయేతర ఐక్య కార్యాచరణ సమితి ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసేందుకు ప్రణాళిక వేసుకుంది. 
 
రేపటి నుంచి ఆరు రోజుల పాటు వివిధ రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్ణయం తీసుకుంది. తొలి రోజైన రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించింది. ఈ నెల 14న తుళ్లూరులో కిసాన్ సమ్మేళనాన్ని నిర్వహిస్తారు. 
 
ఈ నెల 15న విజయవాడలో రాజధాని పరిరక్షణ పాదయాత్రను చేస్తారు. చివరిరోజయిన ఈ నెల 17న ఉద్ధండరాయునిపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తారు. ఈ నెల 13, 16న కూడా నిరసనలు తెలుపుతారు. తమ ఉద్యమం ఇక్కడితో ఆగిపోదని, అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించే వరకు కొనసాగిస్తూనే ఉంటామని ఐకాస నేతలు స్పష్టం చేశారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
మరో 'ఎన్టీఆర్' కావాలని... సైకిల్ గుర్తుపై కన్నేసిన 'బాషా'