1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Anakapalli: C M Ramesh condemns attack on BJP leader

అనకాపల్లిలో డ్రోన్ ప్రచారం.. బీజేపీ నేతల దాడిపై సీఎం రమేష్ ఫైర్

Anakapalli
భాజపా నేతపై దాడిని ఖండిస్తూ అనకాపల్లి లోక్‌సభ అభ్యర్థి సిఎం రమేష్‌ ఆధ్వర్యంలో శనివారం మాడుగుల మండలం తరువ గ్రామంలో నిరసన చేపట్టారు. మాడుగులలోని కొన్ని గ్రామాల్లో డ్రోన్లతో బీజేపీ నేతలు పార్టీ జెండాలను ఎగురవేశారు. అనకాపల్లిలో వైఎస్సార్‌సీపీ లోక్‌సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు మద్దతుదారులు డ్రోన్ ప్రచారాన్ని వ్యతిరేకించారు. ప్రచారాన్ని వ్యతిరేకించడంతో, రెండు పార్టీలు తీవ్ర వాగ్వివాదానికి దిగాయి. ఇది బిజెపి నాయకుడిపై దాడికి దారితీసింది.
 
విషయం తెలుసుకున్న సీఎం రమేష్ గ్రామానికి వచ్చి బీజేపీ నేతకు మద్దతు తెలిపారు. ఇదిలా ఉండగా గ్రామ వివాదంలో జోక్యం చేసుకోవద్దని రమేష్‌ను హెచ్చరించిన స్థానికులు వెంటనే గ్రామం విడిచి వెళ్లాలని కోరారు. అయితే రమేష్ తన నిరసనను కొనసాగించగా, గ్రామస్తులు కొందరు రమేష్‌ను అడ్డుకున్నారు. ఈ క్రమంలో అతడి చొక్కా చిరిగిపోయింది. 
 
కాగా, పోలీసులు రమేష్‌ను దేవరపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. తనపై దాడి జరుగుతోందని సీఎం రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు పోలీసులు ఇరువర్గాలకు నోటీసులు జారీ చేశారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
మే 6,7,8 తేదీల్లో ఇంటింటికి ఓటింగ్ ప్రక్రియ- ఇంటింటికి మొబైల్ పోలింగ్ బృందాలు