మంగళవారం, 2 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 19 జూన్ 2023 (12:13 IST)

ఏపీలో ఒంటిపూట బడులు పొడగింపు

schools
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆ రాష్ట్ర వ్యాప్తంగా బడులను ఒక్కపూట మాత్రమే నిర్వహిస్తున్నారు. కొత్త విద్యా సంవత్సరానికిగాను ఈ నెల 12వ తేదీన ఒంటిపూట బడులను పునఃప్రారంభించారు. అయితే, ఎండల తీవ్ర అధికంగా ఉండటంతో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను నిర్వహించాలని తొలుత భావించారు. ప్రస్తుతం ఈ ఎండలు ఇంకా తగ్గకపోవడంతో మరోమారు ఒంటిపూట బడులను పొడగించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ నెల 24వ తేదీ వరకు ఒంటి పూట బడులను నిర్వహించాలని ఆదేశించారు. 
 
జూన్ 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ ఎండలను దృష్టిలో ఉంచుకుని ఈ నెల 17వ తేదీ వరకు ఒంటిపూట బడులను జరపాలని నిర్ణయించారు. ఇప్పటికీ ఎండలు ఏమాత్రం తగ్గక పోవడంతో తాజాగా ఈ పొడగింపు నిర్ణయం తీసుకున్నారు. ఈ బడులను ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఇది అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలకు వర్తిస్తుదంని పాఠశాల విద్యాసఖ కమిషనర్ సురేశ్ కుమార్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.