1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 12 మే 2020 (21:25 IST)

పారిశుద్ధ్య కార్మికుల సేవలు వద్దా?: సిఐటియు

రాజధానిలో పారిశుద్ధ్య కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన  బాట పట్టి ఐదు రోజులు అవుతున్నప్పటికీ అధికారులు ఏజెన్సీ బాధ్యులు స్పందించకపోవడం అన్యాయమని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి అన్నారు.
 
ఎర్రబాలెం పంచాయతీ కార్యాలయం వద్ద నాలుగు నెలల పెండింగ్ జీతాలు ఇవ్వాలని కోరుతూ మంగళవారంనాడు ఆందోళన చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి రవి మాట్లాడుతూ.. ఏజెన్సీకి పారిశుద్ధ్య పనులు అప్పగించిన సీఆర్డీఏ అధికారులు ఏజెన్సీ కార్మికులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా కాల్చుకు తింటుంటే చోద్యం చూడటం ఏమిటని రవి ప్రశ్నించారు.

ఏజెన్సీ బాధ్యులు రాజధాని లోని 29 గ్రామాలలో  ఏ గ్రామంలోనైనా ఎ ఒక్క పారిశుద్ధ్య  కార్మికుడు కైనా చేతులు కడుక్కునేందుకు ఒక్క సోపు అయినా ఇచ్చారా అని అన్నారు.

ఇప్పటికైనా సీఆర్డీఏ కమిషనర్ వెంటనే జోక్యం చేసుకుని రాజధాని పారిశుద్ధ్య కార్మికుల పెండింగ్ జీతాలు ఇప్పించాలని కార్మికులకు రక్షణ చర్యలు చేపట్టాలని పని భద్రత కల్పించాలని రవి డిమాండ్ చేశారు.