1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. car accident in kurnool district

బావిలోకి దూసుకెళ్లిన కారు.. ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

car
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలో కారు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారులో అదుపుతప్పి ఎక్కువగా నీరు ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కర్నూలు నుంచి ఎమ్మిగనూరు వైపు వెళ్తున్న కారు.. ముందు వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో బావిలోకి దూసుకెళ్లింది.
 
ప్రమాదానికి గురైన కారులో ఒక్కరే వున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.  మృతుడు కోడుమూరుకు చెందిన రామాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
ఉగాది నుంచే కొత్త జిల్లాల నుంచి కార్యకలాపాలు: సీఎం జగన్