1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Cong leaders, Allagadda BJP leaders join YSRC

ఏపీ సీఎం జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన ఆ ఇద్దరు..

ysrcp flag
తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీసీసీ కిసాన్ సెల్ అధ్యక్షుడు జెట్టి గుర్‌నాథరావు, జంగారెడ్డిగూడెం మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ముప్పిడి శ్రీనివాస్‌లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. 
 
వైఎస్‌ఆర్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త పీవీ మిధున్‌రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని పాల్గొన్నారు. క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ఆళ్లగడ్డ బీజేపీ ఇన్‌చార్జి భూమా కిషోర్‌రెడ్డి, ఇతర నేతలు భూమా వీరభద్రరెడ్డి, గంధం భాస్కరరెడ్డి, అంబటి మహేశ్వరరెడ్డి, పలువురు వైఎస్సార్‌సీపీలో చేరారు.
 
నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రరెడ్డి (నాని), వైఎస్సార్‌సీపీ ప్రాంతీయ సమన్వయకర్త రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తర్వాతి కథనం
ఢిల్లీలో కూలిన ఆంబియెన్స్ మాల్‌ పైకప్పు.. వీడియో వైరల్