సంబంధిత వార్తలు
- విదేశాల నుండి వచ్చిన వారిని హోం ఐసోలేషన్లో ఉంచాలి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
- కరోనా భయం: ఇంట్లో నుంచి కదలని ఇటలీ ప్రధాని, మీరు కూడా రావద్దంటూ సూచన
- విదేశాల నుంచి వస్తే.. 14 రోజులు ఇంట్లోనే..ఎక్కడ?
- 26 లక్షల మందికి ఇళ్ల స్థలాలు: రామాయపట్నం పోర్టుకు అడ్డంకుల తొలగింపు
- ఇక బహుజన అమరావతి: ఆళ్ల రామకృష్ణారెడ్డి
ముందు వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో వాళ్లకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయించాలి: అనిత
మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని విశాఖలో ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను తెలుగు మహిళా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత ఖండించారు. ఈ డిమాండ్ ఎవరు చేశారో వాళ్ళ ఇంట్లోని మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయించాలని ఎద్దేవా చేశారు.
వైసీపీ సర్కార్పై అనిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కాదని.. అరాచక దినోత్సవమని వ్యంగ్యాస్త్రం సంధించారు. వైసీపీ చేసే తప్పుడు పనులకు ‘సాక్షి’ కరపత్రంగా మారిందని విమర్శించారు.
‘రాయలసీమ ముద్దుబిడ్డ జగనన్న’ అంటూ ఒక మంత్రి టిక్టాక్లు చేసుకొనే కేబినెట్ ఇక్కడ ఉందన్నారు. ప్రతిపక్షాలు నామినేషన్లు వేయకుండా వైసీపీ ప్రయత్నం చేస్తోందని, ఇదేమి న్యాయమని ఆమె ప్రశ్నించారు.
టీడీపీ అంటే వైసీపీకి భయమని, అందుకే నామినేషన్లు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. జగన్ 9 నెలల పాలనలో కనీసం 9 సామాజిక వర్గాలైనా సంతోషంగా ఉన్నాయా అని నిలదీశారు. ఓడిపోతామని తెలిసినా వర్ల రామయ్య హ్యాపీగా రాజ్యసభకు పోటీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
టీటీడీ బోర్డులో ఒక దళితుడు కూడా లేడని, దళితులకు వైసీపీ అన్యాయం చేసిందని, దీనికి అధికార పార్టీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సాహిస్తున్నారని, వారి పరిపాలన అంతా ప్రజలు గమనిస్తున్నారన్నారు.
మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టు చేయాలని విశాఖలో ఒక వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను ఖండించిన అనిత.. ఈ డిమాండ్ ఎవరు చేశారో వాళ్ళ ఇంట్లోని మహిళలకు బ్రీత్ ఎనలైజర్ టెస్టులు చేయించాలని ఎద్దేవా చేశారు.
తర్వాతి కథనం
