1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 12 డిశెంబరు 2020 (18:31 IST)

భార్యతో వీడియో కాల్ మాట్లాడుతూ బట్టలిప్పమని, ఠక్కున ఆ పని చేసిన భర్త

కొత్తగా పెళ్ళయ్యింది. ఉద్యోగం వేరే రాష్ట్రంలో ఉండటంతో భార్యను తరువాత తీసుకెళదామని ఒక్కడే వెళ్ళాడు. ఎప్పటిలాగే సింగిల్ రూమ్‌లో గడుపుతూ ఉన్నాడు. భార్యతో ప్రతిరోజు ఫోన్లో మాట్లాడేవాడు. కానీ ఉన్నట్లుండి ఆత్మహత్య చేసుకున్నాడు భర్త. 
 
మధ్యప్రదేశ్ బాలాగ్ హాట్ జిల్లా తెలిసిల్లాబర్రాకు చెందిన పంకజ్‌కు చిత్తూరు జిల్లా సోమలకు చెందిన కిరణ్ కుమారితో ఆరు నెలల క్రితం వివాహం జరిగింది. మధ్యప్రదేశ్‌లో బ్యాంకు అధికారిగా పనిచేస్తున్నాడతను. భార్య కూడా అగ్రికల్చరర్ ఫీల్డ్ ఆఫీసర్.
 
భార్యకు ఇక్కడ పర్మినెంట్ ఉద్యోగం కావడం.. తను కూడా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వర్తిస్తుండటంతో భార్యను ఇక్కడే వదిలి వెళ్లాడు. అయితే భార్య లేదన్న బాధ అతనిలో నెలకొంది. దాంతో పాటు స్నేహితులు సూటిపోటి మాటలనడం అతన్ని తీవ్రంగా కలిచివేసింది. 
 
నువ్వు ఇక్కడుంటే నీ భార్య ఇంకొకరితో అంటూ ప్రాణ స్నేహితులే హేళన చేయడంతో అతను మనస్థాపానికి గురయ్యాడు. ఎప్పటి లాగా భార్యతో వీడియో కాల్ మాట్లాడాడు. ఆమెతో మాట్లాడుతూ బట్టలిప్పమన్నాడు. భర్త ఎందుకు అలా అడుగుతున్నాడో కిరణ్ కుమారికి అర్థం కాలేదు. చివరిసారి నిన్ను చూడాలని చెబుతూ ఉన్నట్లుండి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసేసుకున్నాడు. భార్యకు ఏం చేయాలో అర్థం కాలేదు. స్నేహితులకు ఫోన్ చేసి చెప్పేలోపే భర్త చనిపోయాడు. దీంతో కిరణ్ కుమారి కన్నీటి పర్యంతమైంది.