సంబంధిత వార్తలు
- కేకేఆర్పై రాజస్థాన్ గెలుపు.. 92 పరుగులతో అదరగొట్టిన సంజు శాంసన్
- త్రివిక్రమ్-జూ.ఎన్టీఆర్ సినిమా ప్రారంభం.. యాక్షన్ సీన్తో?
- ఐపీఎల్ 2018 : సొంతగడ్డపై ప్రత్యర్థులను చితక్కొడుతున్న సన్రైజర్స్
- కేసీఆర్ వంటి సీఎంను నేనెక్కడా చూడలేదు: బాబా రాందేవ్
- ఉత్తేజ్ డ్యాన్స్ స్కూల్ 'మయూఖ' ( ఎరెనా ఆఫ్ పెర్ఫామింగ్ ఆర్స్ట్) ప్రారంభం
అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానంది.. మైలారం రైల్వేస్టేషన్ వద్ద?
అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు శివార్లలోని లింగంపల్లిలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న జ్యోతి మృతదేహం మైలార
అమ్మమ్మ ఇంటికి వెళ్ళొస్తానని ఇంటి నుంచి వెళ్ళిన ఓ బ్యూటీషియన్ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాదు శివార్లలోని లింగంపల్లిలో బ్యూటీషియన్గా పనిచేస్తున్న జ్యోతి మృతదేహం మైలారం రైల్వే స్టేషన్ సమీపంలో పోలీసులు గమనించారు. ఆదివారం తాండూరులోని తన అమ్మమ్మ ఇంటికెళ్లి వస్తానని బయల్దేరింది.
అయితే ఆమె అనుమానాస్పద రీతిలో మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా హత్య చేశారా? లేక రైలు నుంచి ప్రమాదవశాత్తూ కింద పడిందా? అన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తన కుమార్తెపై అత్యాచారం జరిపి హత్య చేశారని జ్యోతి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు కేసును విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
