1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. IAS Amrapali Gets AP Tourism

ఏపీకి ఐఏఎస్‌ అధికారులు బదిలీ - ఆమ్రపాలికి టూరిజం

Amrapali IAS
ఆంధ్రప్రదేశ్‌కు బదిలీ అయిన నలుగురు ఐఏఎస్‌ అధికారులకు పోస్టింగ్‌ ఇచ్చారు. ఏపీ టూరిజం శాఖ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమ్రపాలి కాటా నియమితులయ్యారు. దీంతోపాటు ఆమెకు టూరిజం అథారిటీ సీఈవోగా బాధ్యతలు కూడా అప్పగించారు.
 
కార్మిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా వాణీ ప్రసాద్‌ను నియమించారు. వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్‌గా వాకాటి కరుణకు పోస్టింగ్‌ ఇచ్చారు. నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్‌గా ఆమెకు అదనపు బాధ్యతలు కూడా అప్పగించారు. నాయక్‌ను కార్మిక శాఖ అదనపు బాధ్యతల నుంచి తప్పించారు.
 
వాణీ మోహన్‌ను పురావస్తు శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఆమె జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (GAD) ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా వ్యవహరిస్తారు. పోల భాస్కర్‌ను జీఏడీ నుంచి రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
 
తెలంగాణకు చెందిన నలుగురు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు ఐఏఎస్‌లు తమ కేడర్‌ బదిలీపై కేంద్రం ఆదేశాలను వ్యతిరేకిస్తూ తమ తమ రాష్ట్రాల్లో తిరిగి ఉండేందుకు అనుమతించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 
 
ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు పోస్ట్ చేయబడిన ఐఏఎస్ అధికారులలో సీహెచ్ హరి కిరణ్, సృజన గుమ్మల, శివశంకర్ లోతేటి ఉన్నారు.
 
 
About Writer
సెల్వి
తర్వాతి కథనం
జనసేన పార్టీకి చెందిన మంత్రి ఇలాకాలో ఆమ్రపాలికి చోటు...