సంబంధిత వార్తలు
- బిట్రగుంట రైల్వే స్టేషన్లో పట్టాలు తప్పిన గూడ్సురైలు
- పాత భవనాల్లోనే నెల్లూరులో అన్న క్యాంటీన్లు.. వచ్చే నెలలోపు ప్రారంభం..
- నెల్లూరు వార్షిక రొట్టెల పండుగ.. సీఎం చంద్రబాబు వర్చువల్ సందేశం
- గూడూరులో దారుణం: కాలేజీకి వెళ్తున్న యువతిని కత్తితో బెదిరించి అత్యాచారం
- బుచ్చిలో మేజర్ బాలిక మిస్సింగ్ : రంగంలోకి దిగిన జనసేన నేత.. కేసు నమోదు చేసిన పోలీసులు
కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం.. డబ్బు కోసం వీడియో తీసి..?
మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా కావలిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటన కావలి పట్టణంలోని తూఫాన్నగర్లో చోటుచేసుకుంది. నిందితుడిని తూఫాన్ నగర్కు చెందిన ఎస్కే మహబూబ్ బాషాగా గుర్తించారు.
ఈ ఘటన కొద్దిరోజుల క్రితమే జరిగినప్పటికీ బాధితురాలి తల్లిదండ్రులు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
నిందితులు ఈ ఘటనను మొబైల్లో చిత్రీకరించి డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు తల్లిదండ్రులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు పోక్సో చట్టం, 2012 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
