గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 11 జులై 2024 (12:25 IST)

బుచ్చిలో మేజర్ బాలిక మిస్సింగ్ : రంగంలోకి దిగిన జనసేన నేత.. కేసు నమోదు చేసిన పోలీసులు

victim woman
నెల్లూరు జిల్లా మండల కేంద్రమైన బుచ్చిలోని కొత్త బస్టాండ్ సమీపంలో వున్న శివాలయ ఎదురుగా చిన్నపాటి వ్యాపారం నడుపుకుంటున్న మహిళ నాగ నిర్మల అనే మహిళ కుమార్తెను మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో బాధిత మహిళ స్థానిక జనసేన పార్టీ నేతలను ఆశ్రయించారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ గురువారం సందర్శించి పోలీస్ స్టేషనులో సిఐతో మాట్లాడి ఎఫ్ఐఆర్ నమోదు చేయించి త్వరితగతిన అదృశ్యమైన బాలికను గుర్తించాలని కోరారు. బాలిక తల్లిదండ్రులు విచారించగా ఫిర్యాదు మాత్రమే ఇచ్చారని కేసు నమోదు చేయమని చెప్పలేదని పోలీసులు తెలిపారు. 
 
ఈ సందర్భంగా జనసేన జిల్లా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ మాట్లాడుతూ, మగదిక్కు లేని ఇద్దరు మహిళలు తమ బిడ్డను తెల్లవారుజామున ఇంటికి ఇంటి నుంచి అపహరించకపోయారని పోలీసులకు తెలిపే రెండు రోజులైనా ఆచూకీ లేదని జనసేన పార్టీని ఆశ్రయించారు. బాలిక మిస్సింగ్ కేసు ఆషామాషీగా చూడడం తప్పు... మేజర్ బాలికే కదా మరో రెండు రోజుల్లో తిరిగి వస్తుందని ఎవరో అధికారులు తెలపడం హేయమైన చర్య. సీఐ వెంటనే స్పందించి కేసు కట్టి విచారణ చేపడతానని హామీ ఇచ్చారు. ఆడబిడ్డకి ఆపద అని తెలపిన తక్షణమే స్పందించి సిఐకి కేసును చేదించమని ఆదేశించిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదములు అని తెలిపారు. వీలైనంత త్వరగా బాలికను తల్లిదండ్రులకు అప్పగించే వరకు కూడా జనసేన పార్టీ తరపున మద్దతుగా నిలుస్తామని తెలిపారు.