సంబంధిత వార్తలు
- చర్చలకు పిలిచి చంపేశారు.. విజయవాడలో యువ పారిశ్రామికవేత్త హత్య
- బెజవాడలో రేషన్ కార్డులు తొలగిస్తారా? లేదు లేదన్న మేయర్ భాగ్యలక్ష్మి
- ఖరీదైన కారులో మృతదేహం.. బెజవాడలో మిస్టరీ డెత్ కలకలం!
- ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో నకిలీ టాటా విరాన్ చైన్ లింక్ ఫెన్స్లతో పాటుగా బార్బ్డ్ వైర్లు స్వాధీనం
- ఒకే పోలీస్ స్టేషన్లో ఏకంగా 9 మందికి కరోనా
నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం ఎపిలగుంట సమీపంలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఆత్మకూరు ఆస్పత్రికి తరిలించి చికిత్స అందిస్తున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వాసులుగా గుర్తించారు.
మదనపల్లి వైపు నుంచి వస్తున్న లారీని విజయవాడ వైపు నుంచి వస్తున్న కారు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
