సంబంధిత వార్తలు
- ఏపీలో యూట్యూబ్ అకాడమీ.. చంద్రబాబు పక్కా ప్లాన్
- ఉదయాన్నే మరుగుదొడ్లను ఫోటోలు తీసే పని తప్పింది.. ఎవరికి?
- 15 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న ఇంటెల్!
- అల్లు అర్జున్పై ట్రోలింగ్ ఆపండి.. మెగా ఫ్యామిలీ ఐక్యంగా వుంటుంది: హైపర్ ఆది
- మీ డ్రీమ్ వెడ్డింగ్ కోసం వన్ స్టాప్ డెస్టినేషన్: రిలయన్స్ రిటైల్ ది వెడ్డింగ్ కలెక్టివ్
వైకాపా నేత దేవినేని అవినాష్కు చుక్కెదురు...
వైకాపనేత దేవినేని అవినాష్కు శంషాబాద్ విమానాశ్రయంలో చుక్కెదురైంది. గురువారం రాత్రి హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు యత్నిస్తుండగా.. విమానాశ్రయ అధికారులు ఆయన్ను అడ్డుకున్నారు. అనంతరం ఏపీలోని మంగళగిరి పోలీసులకు వారు సమాచారం అందించారు.
ఆయనపై కేసులు ఉన్నందున ప్రయాణానికి అనుమతి ఇవ్వొద్దని పోలీసులు వారిని కోరారు. ఈ క్రమంలో దేవినేని అవినాష్ ప్రయాణాన్ని అధికారులు అడ్డుకోవడంతో.. ఎయిర్పోర్టు నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో దేవినేని అవినాష్పై ఎఫ్ఐఆర్ నమోదైన విషయం తెలిసిందే. ఈ దాడిలో పాల్గొన్న వారిపై పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టి.. లుకౌట్ నోటీసులు జారీ చేశారు.
