శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (14:10 IST)

బాబోయ్... తాగి వాహనం నడుపుతున్నారు

'మద్యం సేవించి వాహనం నడపరాదు' అన్ని ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా మందుబాబుల తీరు మారడంలేదు. వారాంతాల్లో జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​ ప్రాంతాల్లో పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున డ్రంకర్స్​ పట్టుబడుతున్నారు.

మహిళలు మేమేం తక్కువకాదంటూ.. తాగి వాహనాలు నడుపుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా మందుబాబుల తీరు మారడం లేదు.

వారాంతం వచ్చిందంటే చాలు...ఫూటుగా మద్యం సేవించడం, స్టీరింగ్ పట్టడం. ఇటీవల కాలంలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.

రాత్రి జూబ్లీహిల్స్​లోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 17 మందిపై కేసులు నమోదు చేశారు.

వారి వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 11కార్లు , ఆరు ద్విచక్ర వాహనాలు ఉన్నాయి.