ఇంట్లో దొంగపడ్డాడు.. మంచంకింద దాక్కున్నాడు.. చివరికి అద్దం పగులకొట్టి...?
Thief
ఒక దొంగ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలను అపహరించిన అనంతరం మంచం కింద దాక్కున్నాడు. సమాచారం ప్రకారం, ఆ దొంగ డొనేపూడి భాస్కర్ ఇంట్లోకి ప్రవేశించి గొలుసు, కడియం, ఉంగరం వంటి బంగారు ఆభరణాలను దొంగిలించాడు. దొంగతనం చేసిన తర్వాత నిందితుడు మంచం కింద దాక్కున్నట్లు తెలిసింది.
ఇంట్లో ఏదో కదలికను గమనించిన భాస్కర్, బయటి నుంచి తలుపుకు తాళం వేసి పొరుగువారిని పిలవడానికి వెళ్లాడు. అయితే, ఆ దొంగ కిటికీ అద్దాన్ని పగలగొట్టి ఇంటి నుంచి పరారయ్యాడు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించి పట్టుకునేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
