సంబంధిత వార్తలు
- ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
- మూడు రాజధానులపై మడమ తిప్పిన వైకాపా... అది అప్పటి విధానమట : బొత్స
- భార్యను ఉద్యోగంలో చేర్పిస్తే తగులుకున్న యువకుడు, ఫోన్ కట్ చేస్తే చంపేసాడు
- వెనుక వంగవీటి రంగా ఫోటో, స్టేజి పైన యువతి అసభ్య భంగిమలో డ్యాన్స్ (video)
- తణుకు పోలీస్ స్టేషన్ వద్ద మహిళా అఘోరీ హల్చల్ - ఆత్మహత్యాయత్నం! (Video)
గోదావరి నదిలో మునిగిన పడవ.. ఇద్దరి మృతి.. 10 మంది సురక్షితం
తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి వద్ద గోదావరి నదిలో పడవ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, మరో పది మంది ప్రాణాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 12 మంది ఉన్నారు. 20 మంది పడవలో లంకకు వెళ్లారు. వారిలో 12 మంది తిరిగి వస్తుండగా పడవ అదుపుతప్పి బోల్తాపడింది.
పడవలోకి నీరు చేరడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో గల్లంతైన వారికోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, అగ్నిమాపకదళ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో అన్నవరం (54), రాజు (25) మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇదిలావుంటే, అనంతపురం జిల్లా రాయదుర్గం మండలంలోని ఊడెగోళం సమీపంలో గత రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువతి (18) ప్రాణాలు కోల్పోయింది. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో బోలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం సమయంలో 35 మంది ఉండగా, ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరు చనిపోగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
