శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2019 (10:41 IST)

బాలుడి ప్రాణం తీసిన నులిపురుగుల మందు

విజయనగరం జిల్లాలో దారుణం జరిగింది. నులిపురుగుల మందు ఓ చిన్నారి ప్రాణంతీసింది. చిన్నారుల కడుపులో ఉండే నులిపురుగులు చావడానికి పోసే మందే.. చివరకు ఆ చిన్నారి ప్రాణమే తీసింది. ఇందుకు కారణమైన ఏఎన్ఎంతో పాటు అంగన్‌వాడీ ఉద్యోగిని వైద్యాధికారులు సస్పెండ్ చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని గరుగుబిల్లి మండలం కొట్నాన రామినాయుడువలస గ్రామంలో గురువారం నులిపురుగుల నివారణ దినోత్సవం నిర్వహించాడు. ఇందులోభాగంగా రామినాయుడువలస గ్రామంలో శిబిరాన్ని ఏర్పాటు చేశాయి. 
 
ఈ శిబిరంలో అంగన్‌వాడీ, ఏఎన్ఎంలు చిననారులకు నులి పురుగుల నివారణ మందులను వేశారు. గ్రామానికి చెందిన రెండేళ్ళ బాలుడు కొట్నాన జశ్విక్ నాయుడును నాన్నమ్మ శిబిరం వద్దకు తీసుకొచ్చింది. 
 
మేము త్వరగా వెళ్లిపోవాలని, మాత్ర ఇవ్వాలని కోరింది. అంగన్‌వాడీ వర్కరు, ఏఎన్ం ఓ మాత్ర తీసి ఆమెకు ఇచ్చారు. బాలుడికి సగం ముక్క వేయాలని సూచించారు.

వారు చెప్పినట్టుగానే మాత్రను రెండు ముక్కలు చేసి ఒక భాగాన్ని బాలుడికి వేసింది. మాత్ర మింగించిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయాడు. దీంతో బాలుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆ బాలుడిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే చనిపోయినట్టు నిర్ధారించారు.