1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Vijayanagaram crime news

మూడో తరగతి చదువుతున్న బాలికపై అత్యాచారం.. అర్థరాత్రి నడిరోడ్డుపై?

Vijayanagaram
వయోబేధం లేకుండా మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అత్యాచారాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై అఘాయిత్యాలు అమాంతం పెరిగిపోతున్నాయి. తాజాగా విజయనగరంలో దారుణం చోటుచేసుకుంది. మూడో తరగతి చదివే బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కామాంధుడు.
 
వివరాల్లోకి వెళితే.. శృంగవరపు కోట మండలం బొడ్డవరకు చెందిన ఓ బాలిక మూడో తరగతి చదువుతోంది. ఆమెను అపహరించిన దుండగుడు చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఐతన్న పాలెం వద్ద రోడ్డుపై అర్థరాత్రి వదిలిపెట్టి పారిపోయాడు.
 
తెల్లవారుజామున అటుగా వెళ్ళిన స్థానికులు తీవ్రస్రావంతో కనిపించిన చిన్నారిని గమనించి ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తర్వాతి కథనం
వారానికి ఒకసారి చూసుకోండి మీ ఓట్లు ఉన్నాయో? లేదో.? : ప‌వ‌న్‌ క‌ళ్యాణ్