శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (14:06 IST)

పసుపు టీ తాగితే ఏమవుతుంది..?

ప్రతీ వంటల్లో తప్పనిసరిగా వాడే పదార్థామంటే అది పసుపే. పసుపుతో ఇతరత్రా బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వేలాది సంవత్సరాలుగా భారతీయులు పసుపును ఔషధంగా ఉపయోగిస్తుంటారు. పసుపులో లభించే కుర్కమిన్ అనే పదార్థంలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉన్నాయి. ఇవి శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో సహాయపడుతాయి.
 
పసుపుతో టీ తయారుచేసి తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. బరువు తగ్గించడంతోపాటు, ఒబిసిటీతో పోరాడడానికి పసుపు టీ చాలా మంచిది. చాలామంది అధిక బరువు తగ్గించాలని ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తుంటారు. వాటిన్నింటిని వదిలేసి పసుపు టీ తాగితే చాలంటున్నారు వైద్యులు. ఎందుకంటే.. అధిక బరువును తగ్గించడంలో పసుపు టీ దోహదం చేస్తుంది. దాంతోపాటు గుండె సంబంధిత వ్యాధుల నుండి కాపాడుతుంది.
 
ఇన్ని ప్రయోజనాలు గల పసుపు టీని ఎలా చేయాలో తెలుసుకుందాం.. 4 కప్పుల నీటిని వేడిచేసి అందులో 2 స్పూన్ల పసుపు పొడిని కలుపుకోవాలి. దాదాపు 10 నిమిషాలపాటు ఈ మిశ్రమాన్ని వేడి చేయాలి. ఆ తరువాత దాన్ని గిన్నెలోకి తీసుకుని 5 నిమిషాలపాటు చల్లార్చాలి. ఆపై అల్లం ముక్క, కొద్దిగా తేనె కూడా కలపొచ్చు. ఇలా తయారుచేసిన టీని రోజూ తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది.