సంబంధిత వార్తలు
- మరో కీలక సమరానికి టీమిండియా రెడీ.. ఇంగ్లండ్తో టెస్ట్ సిరీస్కు సై
- డా.రెడ్డీస్ ల్యాబొరేటరీ గుడ్న్యూస్... అక్టోబర్లో స్పుత్నిక్-వి
- ప్రపంచంలోనే తెలివైన విద్యార్థిని.. అసాధారణ ప్రతిభతో మెప్పించిన ఎన్ఆర్ఐ బాలిక
- ఇండియా గ్రీన్ మాన్యుఫాక్చరింగ్ ఛాలెంజ్ గోల్డ్ అవార్డులను గెలుచుకున్న విజయవాడ హెచ్సీసీబీ
- మాండెలెజ్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ -19 సహాయక చర్యలకు మద్దతును అందిస్తుంది
కొనసాగుతున్న కరోనా విజృంభణ : మరో 42 వేల పాజిటివ్ కేసులు
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనేవుంది. రోజువారీ కేసులను పరిశీలిస్తే సోమవారం 24 గంటల్లో 30 వేలకు దిగిరాగా.. తాజాగా అంటే గత 24 గంటల్లో 42 వేలకు పైగా నమోదయ్యాయి. మొత్తం 42,625 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది.
కొత్తగా 26,668 మంది బాధితులు కోలుకోగా.. మరో వైపు 562 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,17,69,132 కు పెరిగింది. ఇప్పటివరకు 3,09,33,022 మంది కోలుకున్నారు. వైరస్ బారినపడి మొత్తం 4,25,757 మంది మృత్యువాతపడ్డారు.
ప్రస్తుతం దేశంలో 4,10,353 యాక్టివ్ కేసులున్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 97.37శాతంగా ఉందని, మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 1.29శాతం ఉందని, రోజువారీ పాజిటివిటీ రేటు 2.31శాతంగా ఉందని తెలిపింది.
దేశంలో ఇప్పటివరకు 47.31 కోట్ల కొవిడ్ పరీక్షలు నిర్వహించామని, టీకా డ్రైవ్లో భాగంగా మొత్తం 48,52,86,570 టీకా మోతాదులు పంపిణీ చేసినట్లు మంత్రిత్వ శాఖ వివరించింది.
