గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 ఆగస్టు 2020 (17:34 IST)

పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాల్సిందే.. మార్చి 2021 వరకు గడువు

పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోలేదంటే.. ఇబ్బందులు తప్పవు. ఆధార్‌తో పాన్ కార్డు లింక్ చేసుకోకపోతే పాన్ కార్డు చెల్లుబాటు కాదు. పాన్ కార్డును ఉపయోగించడం కుదరదు. ఇప్పటిదాకా 32.71 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో అనుసంధానమయ్యాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది.
 
మోదీ సర్కార్ పాన్ ఆధార్ లింక్ గడువును పొడిగిస్తూ వస్తున్న నేపథ్యంలో.. తాజాగా పాన్ ఆధార్ అనుసంధానానికి గడువు మార్చి 2021 వరకు ఉంది. జూన్ 29 నాటికి దేశంలో జారీ అయిన పాన్ కార్డుల సంఖ్య 50.95 కోట్లుగా ఉంది. 
 
నిర్దేశిత గడువులోగా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోకపోతే పాన్ కార్డులు పని చేయవని, చెల్లుబాటు కావని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇంకా ఇప్పటికీ 18 కోట్ల పాన్ కార్డులు ఆధార్ కార్డులతో లింక్ కావాల్సి ఉంది. 
 
ఇంకా పాన్ కార్డును ఆధార్‌తో లింక్ చేసుకోని వారికి ఇంకా 7 నెలల గడువు ఉంది. ఎక్కువ గడువు ఉందని అలాగే ఉండిపోవద్దు. వెంటనే రెండింటినీ లింక్ చేసుకోండి. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వెబ్‌సైట్‌కు వెళ్లి ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చు. క్షణాల్లో పని పూర్తి చేసుకోవచ్చునని ఐటీ నిపుణులు చెప్తున్నారు.