ఉద్యోగులకు షాకిచ్చిన యాక్సెంచర్.. ఫేక్ లెటర్స్ అందుకే వేటు..
ఐటీ కంపెనీ యాక్సెంచర్ తన ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. వేలాది మంది ఉద్యోగులను తొలగించింది. తమ ఉద్యోగుల్లో చాలా మంది ఫేక్ డాక్యుమెంట్లు, ఫేక్ ఎక్స్పీరియన్స్ లెటర్స్ పెట్టి ఉద్యోగాలు పొందినట్లు యాక్సెంచర్ ఇండియా యూనిట్ కనిపెట్టింది. దీంతో ఆ ఉద్యోగులపై వేటు వేసింది.
యాక్సెంచర్స్లో మోసపూరిత కంపెనీల నుంచి ఎక్స్ పీరియన్స్ లెటర్లు, ఫేక్ డాక్యుమెంట్లు అందించినట్లు గుర్తించడంతో అలాంటి వారిని తొలగించడం జరిగిందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
ఇలా ఫేక్ డాక్యుమెంట్లు తయారుచేయడం, ఫేక్ ఎక్స్పీరియెన్స్ లెటర్స్ పెట్టడం నిబంధనలు ఉల్లంఘించడం కంపెనీని మోసం చేయడమేనని చెప్పింది.