గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 21 జులై 2024 (09:02 IST)

నిన్నటికి నిన్న చిరుత పులి.. నేడు నాగర్ కర్నూలులో కొండచిలువ

python
python
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీపురం రోడ్డులోని రవి థియేటర్ సమీపంలోని పాత సరుకుల గోదాము ముందు కొండచిలువ ఉన్నట్లు స్థానిక కాలనీ వాసులు గుర్తించారు. జిల్లా కేంద్రం నడిబొడ్డున కొండచిలువ కనిపించడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి కొండచిలువను పట్టుకుని అడవిలోకి వదలాలని స్థానికులు కోరుతున్నారు.
 
మరోవైపు నిన్నటికి నిన్న నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పోలేపల్లి గ్రామ పంట పొలాల పరిసర ప్రాంతంలో కొన్ని రోజులుగా చిరుత పులి సంచారం స్థానిక రైతులను భయపెడుతుంది.  తాజాగా రాములు అనే రైతులు తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లిలన క్రమంలో చిరుత పులి కనిపించింది. 
 
తన సెల్‌ఫోన్‌లో చిరుతను వీడియో తీసి గ్రామస్తులకు చేరవేశాడు. నల్లమల చిరుతలు ఆహార వేటలో భాగంగా పొలాలు, గ్రామాల వైపు వస్తున్నాయని దీంతో తమతో పాటు పశు సంతతికి ప్రాణహానీ నెలకొందని వారు వాపోతున్నారు.