సంబంధిత వార్తలు
- బాక్సాఫీస్ దుమ్ముదులుపుతున్న 'పఠాన్' - రూ.1000 కోట్ల దిశగా...
- వినరో భాగ్యము విష్ణు కథలో సాహిత్యానికి పెద్ద పీఠ
- సందీప్ లో కష్టం, ప్రతిభ కనిపించింది : నాని
- ఉత్సాహంగా ముగిసిన ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ 2023, గత సంవత్సరంతో పోలిస్తే 100% పెరిగిన రిజిస్ట్రేషన్లు
- త్వరలో సికింద్రాబాద్ - తిరుపతి మధ్య వందే భారత్ రైలు సర్వీస్
నిజామాబాద్ జిల్లాలో వాహనం ఢీకొని చిరుతపులి మృతి
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో గుర్తు తెలియని వాహనం ఢీకొని చిరుతపులి మృతి చెందింది. చాంద్రాయణపల్లి సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టింది. చిరుత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించారు. కేసు నమోదు చేసి చిరుతను ఢీకొన్న వాహనాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని అటవీశాఖ అధికారులు తెలిపారు.
అతివేగం జంతువులను పొట్టనబెట్టుకుంటుంది. చాంద్రాయణపల్లి సమీపంలో చిరుతపులిని చంపేశారు.. అని తెలంగాణ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మోహన్ పర్గేయన్ ట్వీట్ చేశారు. నిజామాబాద్తో పాటు పక్కనే ఉన్న కామారెడ్డి జిల్లాలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఇలాంటి ప్రమాదాలు జరగకుండా అడవుల గుండా వెళ్లే హైవేలపై వాహనాల వేగాన్ని నియంత్రించాలని జంతు సంరక్షణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. జంతువుల కోసం అడవుల్లో అండర్పాస్లు, వంతెనలు నిర్మించాలని సూచించారు.