గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎంజీ
Last Updated : సోమవారం, 6 సెప్టెంబరు 2021 (08:03 IST)

కాంగ్రెస్‌ కు వెన్నుపోటు పొడవకండి: మధుయాస్కీ

"కాంగ్రెస్‌ నుంచి బయటకు వెళ్లాలనుకునేవారు వెళ్లొచ్చు.. కానీ పార్టీలో ఉంటూ వెన్నుపోటు మాత్రం పొడవకండి" అని పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ కోరారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఎదుగుదలైనా, తన ఉన్నతైనా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ వల్లే అన్నారు.

వైఎస్‌ విజయమ్మ నిర్వహించింది ఆత్మీయ సమ్మేళనం కాదని.. అది రాజకీయ సమ్మేళనం అని విమర్శించారు. ఆ సమ్మేళనానికి వెళ్లొద్దని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లినా కొంతమంది హాజరయ్యారన్నారు.

ఆ ఆదేశాలను పట్టించుకోకుండా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే రాజకీయ వేదిక మీదకు వెళ్లి మాట్లాడటం ద్వారా పార్టీకి నష్టమే జరుగుతుందన్నారు. కోమటిరెడ్డిపై చర్యలు తీసుకోవాలా?, వద్దా? అనేది అధిష్ఠానం చూసుకుంటుందన్నారు.

వైఎస్సార్‌ బతికుంటే తెలంగాణ ఏర్పడేదే కాదని విజయమ్మ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్థిస్తారా? అని మధుయాస్కీ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటనలో ప్రధాని మోదీకి ఇచ్చిన వినతులు విభజన చట్టంలోనే ఉన్నాయని.. వాటిని ఏడేళ్లు ఎందుకు మర్చిపోయారని మధుయాస్కీగౌడ్‌ నిలదీశారు.