శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 నవంబరు 2022 (11:33 IST)

ధరణి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కలెక్టర్లతో సీఎం సమావేశం

cmkcr
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం జిల్లా కలెక్టర్లతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. త్వరలోనే రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల అజెండాతో పాటు అభివృద్ధి పనులు, పథకాలపై ఆయన సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. 
 
దీనిపై ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ అన్ని జిల్లాల కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీచేశారు. పీవోబీ, తప్పులు సరిదిద్దడం తదితర సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని సూచించారు. వీటిపైనే కలెక్టర్లు గత 15 రోజుల నుంచి వీఆర్ఏలు, ఆర్ఐలు, తాహశీల్దారులు, ఆర్డీవోలు ఈ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించారు. 
 
ధరణి పోర్టల్ పీవోబీ, పాస్ బుక్ డేటా కరెక్షన్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. జిల్లా వారీగా అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పిలిపించి సమీక్ష నిర్వహించారు. ఇపుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి ఈ సమీక్ష నిర్వహించనున్నారు.