సంబంధిత వార్తలు
- హరికృష్ణ మీ చుట్టమా? ఎవడబ్బ సొమ్మని స్థలం కేటాయించారు? కేసీఆర్కు కొండా సురేఖ ప్రశ్న
- ఎన్టీఆర్ బయోపిక్లో సెన్సేషనల్ హీరో నటిస్తున్నాడా..?
- ఇండియా టుడే ప్రీ-పోల్ సర్వే.. తెలంగాణలో కేసీఆరే సీఎం.. తిరుగులేదు
- కేసీఆర్ నెక్స్ట్ టార్గెట్.. రేవంత్ రెడ్డేనా? టిలో వేడెక్కిన పాలి'ట్రిక్స్'
- మేనల్లుడు గెలుపు కోసమే అరెస్టు చేయించారు : తూర్పు జగ్గారెడ్డి
జైల్లో నాకు చుక్కలు చూపించారు... ప్రజలు మద్దతిస్తే కేసీఆర్కు చుక్కలు చూపిస్తా: జగ్గారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలను పాలించాలని కేసీఆర్కు అధికారం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎదిరిస్తే కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మనుషుల అక్రమ రవాణా కేసులో కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రాష్ట్ర విభజన తరువాత ప్రజలను పాలించాలని కేసీఆర్కు అధికారం కట్టబెడితే... ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని విమర్శించారు.
ఏ తప్పు చేయని తనపై ప్రభుత్వం సుమోటోగా కేసు పెట్టిందని వాపోయారు. 2004 కేసులో తన పేరు లేదని గుర్తు చేశారు.. తప్పు చేశానా.. లేదా అని కోర్టు తేలుస్తుందన్నారు. రాహుల్ సభ తర్వాత తనను ప్రభుత్వం టార్గెట్ చేసిందని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మీపై కూడా తప్పుడు కేసులు పెడితే అది మంచి సంప్రదాయం అవుతుందా అని ప్రశ్నించారు.
13 రోజులు తనకు జైల్లో చుక్కలు చూపెట్టారని వాపోయారు. పోలీసులు కూడా పక్షపాతం వహించకుండా న్యాయబద్ధంగా ఉండాలని హితవు పలికారు. ఏ విషమైనా ఎంతో ధైర్యంగా మాట్లాడే వాడినని అటువంటిది నన్ను భయభ్రాంతులకు గురిచేశారని వాపోయారు. ప్రజలు ఆదరించి ఆశీస్సులు ఇస్తే కేసీఆర్కి చుక్కలు చూపిస్తానని తెలిపారు.
