మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 నవంబరు 2021 (17:35 IST)

ఏపీ సీఎంపై తెలంగాణ మంత్రి ఫైర్.. నిధులు లేక భిక్షమెత్తుకుంటున్నారు..

ఆంధ్రా ముఖ్యమంత్రి జగన్ నిధులు లేక కేంద్రాన్ని అడుక్కు తింటున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతు ధర్నాలో పాల్గొన్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. 
 
గతంలో తెలంగాణ ఏర్పడితే అడుక్కుతింటారని ఎద్దేవా చేసిన వారే ఇప్పుడు బిక్షం ఎత్తుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద‌ప్ర‌భుత్వం రైతుల‌ను చేస్తున్న మోసాల‌కు బీజేపీ నేత‌ల‌ను అడుగ‌డుగునా అడ్డుకోవాల‌ని పిలుపునిచ్చారు. 
 
ఏపీ నడవాలంటే కేంద్రం నిధులు కావాలన్న ప్రశాంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వ ఒత్తిడితోనే ఏపీలో రైతుల మోటార్లకు మీటర్లు పెట్టారని విమర్శించారు. దేశం మొత్తం రైతులు మోటార్ల‌కు మీట‌ర్లు పెట్టాల‌నే ప్ర‌ధాని మోడీ ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఎద్దేవా చేశారు.