1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Mothkupalli Narsimhulu joins BJP

బీజేపీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు

Mothkupalli Narsimhulu
తెలంగాణ సీనియర్ రాజకీయ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఇవాళ బీజేపీలో చేరారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిల సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా నడ్డా ఆయనకు బీజేపీ సభ్యత్వ రశీదు అందజేశారు. ఇవాళ ఉదయం ఢిల్లీ వెళ్లిన మోత్కుపల్లి బీజేపీ అగ్రనేత నడ్డాను కలిశారు. ఆయన వెంట తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్, ఎంపీలు సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు తదితరులున్నారు.
తర్వాతి కథనం
పిన్నెలి కారు ఆపి డోరు ఎందుకు తీశారు?