1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. South Central Railway to run special trains during Sankranti

ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి మరో 10 రైళ్లు

South Central Railway
ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు నగరాలను తమ ఊర్లకు వెళ్లే వారికోసం అదనంగా మరో పది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రటించింది. ఈ రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి బయలుదేరుతాయి. అలాగే, మరికొన్ని రైళ్లు కాజీపేట, నల్గొండల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, ఈ రైళ్లలో రిజర్వేషన్ టిక్కెట్లు హాట్ కేకుల్లా కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో అనేక తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 10 రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో ఈ నెల 1, 14న కాచిగూడ - విశాఖపట్టణం, 8, 16న విశాఖపట్టణం - కాచిగూడ, 11న కాచిగూడ - నర్సాపూర్, 12న నర్సాపూర్ - కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్ - లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్‌కు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 
 
అయితే కాచిగూడ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు కాజీపేట మీదుగా, కాచిగూడ నుంచి నర్సాపూర్ వెళ్లే రైళ్లు నల్గొండ మీదుగా, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లే రైళ్లు సామర్లకోట మీదుగా నడుస్తాయని వివరించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
హస్తినకు వెళ్ళనున్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి