అబ్ధుల్లాపూర్మెట్ తహశీల్దార్ విజయారెడ్డిని అతి కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. తహశీల్ధార్ కార్యాలయంలోకి వెళ్ళి ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించి అతి దారుణంగా చంపేశారు. మంటల్లో చిక్కుకున్న ఎమ్మార్వో బయటకు వచ్చి కేకలు వేశారు. అయితే ఆమెను కాపాడేందుకు డ్రైవర్ గురునాథం, అటెండర్లు ప్రయత్నించారు. కానీ అప్పటికే విజయారెడ్డి శరీరం పూర్తిగా కాలిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిందే. అయితే మొదట్లో తహశీల్ధార్ కార్యాలయం నుంచి గట్టిగా అరుపులు...