1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (13:42 IST)

జొన్న రొట్టెలు చేస్తున్న మహిళను కత్తితో పొడిచిన దండగుడు

తెలంగాణ రాష్ట్రంలోని మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో దారుణం జరిగింది. మద్యం మత్తులో ఓ దండగుడు మహిళను కత్తితో పొడిచి చంపాడు. మృతురాలు జొన్నరొట్టెలు తయారు చేస్తుండగా ఈ దారుణం జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జగద్గిరిగుట్ట షిరిడీకు చెందిన కవిత (35) అనే మహిళ తన ఇంటి ముందే జొన్నరొట్టెలు తయారు చేసి, వాటిని విక్రయించుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇదే కాలనీలో గ్యాస్ సప్లయ్ చేసే యాదగిరి అనే వ్యక్తి జొన్నరొట్టెలు చేస్తున్న సమయంలో ఆమె వద్దకు వచ్చి వాదనకు దిగారు. 
 
అప్పటికే పీకలవరకు మద్యం సేవించివుండటంతో నిగ్రహం కోల్పోయిన యాదగిరి ఆమెను కత్తితో కిరాతకంగా పొడిచాడు. దీంతో తీవ్ర రక్తస్రావానికి గురైన ఆ మహిళ అక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి పరారీలో ఉన్న యాదగిరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.