ఆదివారం, 28 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 డిశెంబరు 2019 (08:29 IST)

దిశ హత్య కేసులో నిందితులు ఎన్‌కౌంటర్‌

శంషాబాద్ లో వెటర్నరీ వైద్యురాలు దిశ హత్య కేసు నలుగురు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం. షాద్‌నగర్‌ దగ్గర ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది.

సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా తప్పించుకునేందుకు నిందితులు యత్నిస్తుండగా ఎన్‌కౌంటర్ చేసినట్లు చెబుతున్నారు. పారిపోతున్న నలుగురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. ఎన్‌కౌంటర్‌లో నిందితులు ఆరిఫ్‌, శివ, నవీన్‌, చెన్నకేశవులు మృతి చెందారు.

సంఘటనా స్థలానికి సీపీ సజ్జనార్‌
దిశ హత్యకేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ జరిగిన సంఘటనా స్థలానికి సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎన్‌కౌంటర్‌పై మరికాసేపట్లో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది. కాగా దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులు ఎన్‌కౌంటర్‌ అయ్యారు.

దిశను చంపిన ప్రాంతంలోనే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసినట్లు తెలిసింది. అయితే పోలీసులు ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. గత నెల 27వ తేదీన వెటర్నరీ డాక్టర్‌పై అత్యాచారం చేసిన నిందితులు హత్య చేసి చటాన్‌పల్లి వద్ద బ్రిడ్జి కింద శవాన్ని కిరోసిన్ పోలీస్ కాల్చిన సంగతి తెలిసిందే.